గుండెపోటుతో ప్రవాస భారతీయుని మృతి
- March 08, 2017
సొంతవారిని ..జన్మభూమిని వదిలి బతుకుతెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన కొందరు తెలుగు తేజాల జీవితాలు మధ్యలోనే మసకబారుతున్నాయి. అధికమైన అంకితభావంతో ఆరోగ్యాలను సైతం ఏమాత్రం పట్టించుకోకుండా ఎడారి దేశాలలో నిరంతరం కష్టించి పని చేస్తుండటంతో ఆరోగ్యం పాడుచేసుకొని అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తమవారికి ఎంతో శోకాన్ని మిగుల్చుతున్నారు.రాస్ అల్ ఖైమః లో IT శాఖలో పనిచేస్తున్న శ్రీ కంబాల ఉమాశంకర ఏసు ప్రసాదరావు బుధవారం రాత్రి 8.45 సమయంలో తీవ్రమైన గుండెపోటు సంభవించడంతో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఇక్కడ నివసిస్తున్న ఆయనకు భార్య,ఏడాది వయస్సు కుమారుడు ఉన్నారు. వివాదరహితుడు..స్నేహశీలిగా మంచి పేరు తెచ్చుకొన్న శ్రీ కంబాల ఉమాశంకర ఏసు ప్రసాదరావు ఆకస్మిక మరణ వార్త పలువురుని దిగ్బ్రాంతికి గురిచేసింది. కాగా,ఆయన భౌతికకాయాన్ని తన స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ద్వారా తణుకు పట్టణంకు తరలించేందుకు తెలుగు తరంగిణి టీం అన్ని లాంఛనాలను పూర్తిచేస్తున్నారు. ఒబ్బిలిశెట్టి అనురాధ APNRT కో-ఆర్డినేటర్, కుదరవల్లి సుధాకర రావు APNRT కో-ఆర్డినేటర్, రాజశేఖర్ చప్పిడి - APNRT మీడియా కో-ఆర్డినేటర్ తమ సేవ సమన్వయంతో భారతదేశంలోని అంబులెన్స్ ద్వారా శ్రీ కంబాల ఉమాశంకర ఏసు ప్రసాదరావు పార్ధీవ దేహాన్ని ఆయన ఇంటికి పంపనున్నారు.మాగల్ఫ్ ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









