సహచరుడ్ని హత్య చేసిన దుబాయ్ వర్కర్
- March 09, 2017
ఓ వ్యక్తి తన సహచరుడ్ని హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. హతుడు, హంతకుడు ఇద్దరూ పాకిస్తాన్కి చెందినవారే. హంతకుడు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. మిడ్ డే బ్రేక్ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుకుంటుండగా, ఇద్దరి మధ్యా ఓ విషయమై తగాదా చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తి, ఇంకో వ్యక్తిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 2016, జులై 26న ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు తన కాలిని, ఇంకో వ్యక్తి మొహమ్మీద పెట్టగా, ఆ కాలి నుంచి వచ్చిన దుర్వాసనకి ఆ వ్యక్తి అసహనంతో, ఆగ్రహంతో ఊగిపోయి, గొడవకు దిగాడని వారిద్దరూ పనిచేస్తున్న సంస్థ సూపర్వైజర్ చెప్పారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడ్ని అంబులెన్స్లో తరలించామని, ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడని ఆయన వివరించారు. తన కుటుంబాన్ని దూషించడం వల్లనే తాను ఆ వ్యక్తిపై దాడి చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం
- ఒమన్లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!







