సహచరుడ్ని హత్య చేసిన దుబాయ్ వర్కర్
- March 09, 2017
ఓ వ్యక్తి తన సహచరుడ్ని హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. హతుడు, హంతకుడు ఇద్దరూ పాకిస్తాన్కి చెందినవారే. హంతకుడు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. మిడ్ డే బ్రేక్ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుకుంటుండగా, ఇద్దరి మధ్యా ఓ విషయమై తగాదా చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తి, ఇంకో వ్యక్తిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 2016, జులై 26న ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు తన కాలిని, ఇంకో వ్యక్తి మొహమ్మీద పెట్టగా, ఆ కాలి నుంచి వచ్చిన దుర్వాసనకి ఆ వ్యక్తి అసహనంతో, ఆగ్రహంతో ఊగిపోయి, గొడవకు దిగాడని వారిద్దరూ పనిచేస్తున్న సంస్థ సూపర్వైజర్ చెప్పారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడ్ని అంబులెన్స్లో తరలించామని, ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడని ఆయన వివరించారు. తన కుటుంబాన్ని దూషించడం వల్లనే తాను ఆ వ్యక్తిపై దాడి చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







