సహచరుడ్ని హత్య చేసిన దుబాయ్ వర్కర్
- March 09, 2017
ఓ వ్యక్తి తన సహచరుడ్ని హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. హతుడు, హంతకుడు ఇద్దరూ పాకిస్తాన్కి చెందినవారే. హంతకుడు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. మిడ్ డే బ్రేక్ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుకుంటుండగా, ఇద్దరి మధ్యా ఓ విషయమై తగాదా చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తి, ఇంకో వ్యక్తిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 2016, జులై 26న ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు తన కాలిని, ఇంకో వ్యక్తి మొహమ్మీద పెట్టగా, ఆ కాలి నుంచి వచ్చిన దుర్వాసనకి ఆ వ్యక్తి అసహనంతో, ఆగ్రహంతో ఊగిపోయి, గొడవకు దిగాడని వారిద్దరూ పనిచేస్తున్న సంస్థ సూపర్వైజర్ చెప్పారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడ్ని అంబులెన్స్లో తరలించామని, ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడని ఆయన వివరించారు. తన కుటుంబాన్ని దూషించడం వల్లనే తాను ఆ వ్యక్తిపై దాడి చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







