గోల్డ్పై ఆర్బీఐ సంచలన నిర్ణయం
- March 09, 2017
ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ- ఎన్బీఎఫ్సీలు బంగారంపై సామాన్యులకు ఇచ్చే
రుణాలు రూ. 25వేలకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా ప్రభుత్వం
చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్బీఎఫ్సీల ద్వారా బంగారంపై
లక్ష రూపాయల వరకు నగదు, ఆపై మొత్తాన్ని చెక్కురూపంలో చెల్లిస్తున్నారు.
ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం నగదు పరిమితిని రూ.20వేలకు తగ్గించామని ఆర్బీఐ పేర్కొంది. పెద్దనోట్ల రద్దుతో ఇప్పటికీ మనీ దొరక్క ఏటీఎం వల్ల ప్రజలు బారులు తీస్తున్న సంగతి తెల్సిందే! ఓ వైపు బ్యాంకు ఖాతా నిర్వహణ సంబంధించిన లావాదేవీలపై రుసుములు, ఇంకోవైపు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బు తెచ్చుకునేవాళ్లకి కొత్త రూల్స్ ఇబ్బందులు ఖాయమని అంటున్నారు సామాన్యులు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







