ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి 17 లక్షల జరిమానా
- March 09, 2017
ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తికి అక్కడి జిర్గా (స్థానిక పంచాయతీ) రూ.17 లక్షల జరిమానా వేసింది. ఆ జంటను మూడు నెలలపాటు గ్రామం నుంచి బహిష్కరిస్తూ ఇటీవల హుకుం జారీచేసింది. దక్షిణ సింధ్ ప్రావిన్సులోని కంధ్కోట్ కషో్మరే జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
కొన్ని నెలల క్రితం సదరు వ్యక్తి అమ్మాయి ఇష్టంతోనే చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే తమ అమ్మాయిని పెళ్లి చేసుకుని పరువు తీశాడనీ, ఇందుకు జరిమానా కట్టాలని ఆమె పుట్టింటివారు జిర్గాలో ఫిర్యాదు చేశారు. కోర్టుల్లో కేసుల భారాన్ని తగ్గించుకునేందుకు గత నెలలోనే పాక్ ప్రభుత్వం జిర్గాల తీర్పులను చట్టబద్ధం చేసింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







