అరార్ లో ఆహారం కలుషితం కావడంతో 27 మంది విద్యార్ధులకు అస్వస్థత
- March 09, 2017
స్థానిక అరార్ లోని ఒక బాలుర పాఠశాల ఫలహారశాలలో ఆహారం కలుషితం కావడంతో బుధవారం మధ్యాహ్నం భోజనం తిన్న 27 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. విద్యార్థులను వైద్యం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రులకు తరలించారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అరార్ బాలుర పాఠశాలలో 27 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఫోన్ కాల్ అందుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం స్థిరమైన స్థితిలో ఉందని వారిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు, మంత్రిత్వ శాఖ తెలిపింది.పాఠశాల జరుగుతున్ నసమయంలో ఫలహారశాలలో లభించే అరార్ బేకరీలలోని ఆహార పదార్ధాలను తిన్న విద్యార్థులకే ఈ ఇబ్బందులు తలెత్తాయి.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









