ప్రారంభమైన “శిఖండి” షూటింగ్
- March 10, 2017
శ్రీ చర్ల మూవీస్ పతాకం పై చర్ల శ్రీనివాస్ యాదవ్ నిర్మిస్తోన్న చిత్రం “శిఖండి”. పి.రాజారెడ్డి ఈ సినిమాతో దర్శకునిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. నూతన నటీనటులు భరత్, భింభిక నటిస్తోన్న ఈ సినిమా ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం పఠాన్ చెరువు టెంపుల్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ప్రముఖ నిర్మాత లయన్ వెంకట్ హీరోయిన్లకు క్లాప్ ఇచ్చి ముహర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శనిర్మాతలు తెలిపారు. 30 రోజులకి పైగా ఈ సినిమా చిత్రీకరణ జరపడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. హైదరాబాద్ లో టాకీ, కర్ణాటకలోని కూర్గ్, మహాబలేశ్వర్ తదితర లోకేషన్స్ లో సాంగ్స్ షూట్ చేసేందుకు ఈ మూవీ టీమ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు డి.ఓ.పి – హరీశ్ ఎస్.ఎన్, ఎడిటింగ్ – ఆవుల వెంకటేశ్, సంగీతం – సంజీవ్ మెగోటి.





తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







