అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- March 05, 2026
టెహ్రాన్: శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి ముంచేయడం పశ్చిమాసియా మరియు దక్షిణాసియా జలాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ నావికాదళానికి చెందిన ప్రతిష్టాత్మక యుద్ధనౌక IRIS దేనా హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా, అమెరికాకు చెందిన ఒక శక్తివంతమైన జలాంతర్గామి దానిని ఢీకొట్టి ముంచేసింది. ఇరాన్ తీరానికి దాదాపు 2,000 మైళ్ల దూరంలో, అంతర్జాతీయ జలాల్లో ఈ దాడులు జరగడం గమనార్హం. భారత నావికాదళానికి అతిథిగా వెళ్తున్న సమయంలోనే ఈ అటాక్ జరిగిందని ఇరాన్ ఆరోపిస్తోంది.
ఈ యుద్ధనౌకలో దాదాపు 130 మంది నావికులు ఉన్నట్లు సమాచారం. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా అమెరికా ఈ “దారుణానికి” పాల్పడిందని అరాఘ్చి విమర్శించారు. “అమెరికా సృష్టించిన ఈ ప్రమాదకరమైన సంప్రదాయానికి ఆ దేశం భవిష్యత్తులో తీవ్రంగా పశ్చాత్తాపపడక తప్పదు” అని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు పశ్చిమాసియాకే పరిమితమైన ఇరాన్-అమెరికా ఘర్షణలు, ఇప్పుడు హిందూ మహాసముద్రానికి పాకడం భారత్ వంటి దేశాలకు ఆందోళన కలిగించే విషయం. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో ఇలాంటి దాడులు జరగడం వల్ల ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా ఈ ఘటన పై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించనప్పటికీ, ఇరాన్ మాత్రం దీనిని యుద్ధ నేరంగా పరిగణిస్తోంది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









