ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- March 05, 2026
అమరావతి: రాష్ట్రాన్ని సినీ, టెలివిజన్ రంగానికి ప్రధానకేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.బుధవారం వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్లో టెలివిజన్ ఫ్రెటర్నీటి ఫోరం సభ్యులు ఎఫిసి ఎండి విశ్వనాధన్తో కలసి మంత్రి దుర్గేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బుల్లితెర కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత 45 ఏళ్ళుగా టివి పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, కళాకారులు ఉపాధికి అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. విశాఖపట్టణం జిల్లా భీమిలి వద్ద కేటాయించిన స్థలంలో టివి నగర్ (నివాస స్థలాలు), స్టూడియోల నిర్మాణం కోసం సభ్యులు చేసిన అభ్యర్థనను సానుకూలంగా పరిశీలిస్తామన్నారు.
అమరావతి, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ప్రాంతాల్లో స్టూడియోల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న టివి నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని, ఉగాధి పురస్కారాల్లో టివి కళాకారులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. దివంగత ప్రముఖులు సుమన్, దేవదాస్ కనకాల పేర్లతో కళాకారులను సత్కరించే ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు. షూటింగ్స్ కోసం ప్రభుత్వ స్థలాలు, ఆడిటోరియాలు, దేవాలయాలు, టూరిజం గెస్ట్ హౌస్లలో రాయీతీలు కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుర్గేష్ తెలి పారు. ప్రభుత్వానికి, టివి పరిశ్రమకు మధ్య వారధిగా పనిచేసేందుకు టెలివిజన్ ఫ్రెటర్నిట్ ఫోరమ్ను అనుసంధాన కమిటీగా గుర్తించాలన్నకోరికను పరిగణనలోనికి తీసుకుంటామని మంత్రి చెప్పారు.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









