మొదలైన ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు
- March 10, 2017
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే దాదాపు 20వేల భద్రతా సిబ్బంది విధులు నిర్వరిస్తున్నారు. యూపీలోని 75 జిల్లాల్లో 78 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఉత్తరాఖండ్లో 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంజాబ్లో 27 ప్రాంతాల్లోని 54 కేంద్రాలు, గోవాలో రెండు కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లోకి ఎటువంటి మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని ఎన్నికల కమిషన్ కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని భద్రతా అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు జరిగే గదుల్లో కేంద్ర భద్రతా బలగాలు మాత్రమే ఉంటారని, వెలుపల స్థానిక పోలీసులు ఉండనున్నట్లు ఈసీ వెల్లడించింది. గుర్తు తెలియని, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశాల వద్దకు అనుమతించవద్దని తెలిపింది. ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాలకు సుమారు 100మీటర్ల దూరం వరకు వాహనాలు, పాదచారులను అనుమతించడానికి వీల్లేదు. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈవీఎంలను తీసుకొచ్చే ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







