నిర్వాసిత అంబులెన్స్ డ్రైవర్ కు జరిమానా విధించిన న్యాయస్థానం
- March 10, 2017
ఒక కూడలిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక ప్రవాస అంబులెన్స్ డ్రైవర్ కు 500 ఖతార్ రియళ్లను జరిమానాగా దోహా క్రిమినల్ కోర్ట్ విధించింది. అంబులెన్స్ నే డీకొట్టి తీవ్రంగా గాయపడిన మరో వాహనదారుడికి సైతం బీమా సంస్థ సహకారంతో 2,000 ఖతార్ రియళ్లను చెల్లించమని న్యాయస్థానం ఆదేశించింది. కూడలిలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ లైట్ ని గమనించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంలో అంబులెన్స్ డ్రైవర్ విఫలమయ్యాడని అలాగే ఇతర మార్గం నుండి కూడలిని దాటుతున్న మరొక వాహనంను ఏ మాత్రం గమనించకుండా దానిని ' ఢీ ' కొట్టాడని పేర్కొంది . అత్యవసర ఫోన్ కాల్ అందుకోవడంతో ఆ ప్రాంతానికి చేరుకొనే తొందరలో ప్రవాస అంబులెన్స్ డ్రైవర్ ఆ తప్పు చేయడం జరిగిందని కోర్టు భావించింది. మరోవైపున అంబులెన్స్ కు మార్గం ఇవ్వకుండా కూడలి దాటడం వలన బాధితుడు ఈ ప్రమాదం జరగడానికి కొంత మేరకు కారణం అని కోర్టు తేల్చింది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







