నిర్వాసిత అంబులెన్స్ డ్రైవర్ కు జరిమానా విధించిన న్యాయస్థానం
- March 10, 2017
ఒక కూడలిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక ప్రవాస అంబులెన్స్ డ్రైవర్ కు 500 ఖతార్ రియళ్లను జరిమానాగా దోహా క్రిమినల్ కోర్ట్ విధించింది. అంబులెన్స్ నే డీకొట్టి తీవ్రంగా గాయపడిన మరో వాహనదారుడికి సైతం బీమా సంస్థ సహకారంతో 2,000 ఖతార్ రియళ్లను చెల్లించమని న్యాయస్థానం ఆదేశించింది. కూడలిలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ లైట్ ని గమనించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంలో అంబులెన్స్ డ్రైవర్ విఫలమయ్యాడని అలాగే ఇతర మార్గం నుండి కూడలిని దాటుతున్న మరొక వాహనంను ఏ మాత్రం గమనించకుండా దానిని ' ఢీ ' కొట్టాడని పేర్కొంది . అత్యవసర ఫోన్ కాల్ అందుకోవడంతో ఆ ప్రాంతానికి చేరుకొనే తొందరలో ప్రవాస అంబులెన్స్ డ్రైవర్ ఆ తప్పు చేయడం జరిగిందని కోర్టు భావించింది. మరోవైపున అంబులెన్స్ కు మార్గం ఇవ్వకుండా కూడలి దాటడం వలన బాధితుడు ఈ ప్రమాదం జరగడానికి కొంత మేరకు కారణం అని కోర్టు తేల్చింది.
తాజా వార్తలు
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









