నిర్వాసిత అంబులెన్స్ డ్రైవర్ కు జరిమానా విధించిన న్యాయస్థానం
- March 10, 2017
ఒక కూడలిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక ప్రవాస అంబులెన్స్ డ్రైవర్ కు 500 ఖతార్ రియళ్లను జరిమానాగా దోహా క్రిమినల్ కోర్ట్ విధించింది. అంబులెన్స్ నే డీకొట్టి తీవ్రంగా గాయపడిన మరో వాహనదారుడికి సైతం బీమా సంస్థ సహకారంతో 2,000 ఖతార్ రియళ్లను చెల్లించమని న్యాయస్థానం ఆదేశించింది. కూడలిలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ లైట్ ని గమనించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంలో అంబులెన్స్ డ్రైవర్ విఫలమయ్యాడని అలాగే ఇతర మార్గం నుండి కూడలిని దాటుతున్న మరొక వాహనంను ఏ మాత్రం గమనించకుండా దానిని ' ఢీ ' కొట్టాడని పేర్కొంది . అత్యవసర ఫోన్ కాల్ అందుకోవడంతో ఆ ప్రాంతానికి చేరుకొనే తొందరలో ప్రవాస అంబులెన్స్ డ్రైవర్ ఆ తప్పు చేయడం జరిగిందని కోర్టు భావించింది. మరోవైపున అంబులెన్స్ కు మార్గం ఇవ్వకుండా కూడలి దాటడం వలన బాధితుడు ఈ ప్రమాదం జరగడానికి కొంత మేరకు కారణం అని కోర్టు తేల్చింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







