బిర్యానీలో గాజుముక్క
- September 24, 2015
భారతదేశంలోని కొచ్చి నుంచి అబుదాబీ ప్రయాణిస్తున్న సమయంలో ఎనిమిదేళ్ళ చిన్నారికి అందించిన బిర్యానీలో గాజు ముక్క కనిపించడం చర్చనీయాంశమయ్యింది. తన కుమార్తెకు విమాన సిబ్బంది అందించిన బిర్యానీలో గాజు ముక్క చూసి తమ కుటుంబం ఆశ్చర్యపోయిందని అబుదాబీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న సునీల్ మదంపిల్ చెప్పారు. అదృష్టవశాత్తూ తన కుమార్తె ఆ గాజు ముక్కను గుర్తించిందనీ, ఒకవేళ చూసుకోకుండా ఆమె నోట్లోకి ఆ గాజుముక్క వెళ్ళిపోయి వుంటే ప్రమాదం సంభవించేదని సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ గాజు ముక్కకు సంబంధించిన ఫొటో తీసి, జరిగిన విషయాన్ని క్యాబిన్ క్రూకి వివరించినట్లు చెప్పారు సునీల్. ఈ ఘటనపై తాను ఇండియా ఎక్స్ఎస్ అధికారులకు ఫిర్యాదు చేశాననీ, లిఖిత పూర్వకంగా ఫిర్యాదును ఇవ్వమని చెప్పారనీ, తాను వారు చెప్పినట్లే చేశాననీ, దీనిపై సింపుల్గా సారీ చెప్పి ఊరుకున్నారన్నారు సునీల్.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







