బిర్యానీలో గాజుముక్క
- September 24, 2015
భారతదేశంలోని కొచ్చి నుంచి అబుదాబీ ప్రయాణిస్తున్న సమయంలో ఎనిమిదేళ్ళ చిన్నారికి అందించిన బిర్యానీలో గాజు ముక్క కనిపించడం చర్చనీయాంశమయ్యింది. తన కుమార్తెకు విమాన సిబ్బంది అందించిన బిర్యానీలో గాజు ముక్క చూసి తమ కుటుంబం ఆశ్చర్యపోయిందని అబుదాబీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న సునీల్ మదంపిల్ చెప్పారు. అదృష్టవశాత్తూ తన కుమార్తె ఆ గాజు ముక్కను గుర్తించిందనీ, ఒకవేళ చూసుకోకుండా ఆమె నోట్లోకి ఆ గాజుముక్క వెళ్ళిపోయి వుంటే ప్రమాదం సంభవించేదని సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ గాజు ముక్కకు సంబంధించిన ఫొటో తీసి, జరిగిన విషయాన్ని క్యాబిన్ క్రూకి వివరించినట్లు చెప్పారు సునీల్. ఈ ఘటనపై తాను ఇండియా ఎక్స్ఎస్ అధికారులకు ఫిర్యాదు చేశాననీ, లిఖిత పూర్వకంగా ఫిర్యాదును ఇవ్వమని చెప్పారనీ, తాను వారు చెప్పినట్లే చేశాననీ, దీనిపై సింపుల్గా సారీ చెప్పి ఊరుకున్నారన్నారు సునీల్.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







