బంగారం దిగుమతి భారీగా తగ్గిపోయింది
- March 12, 2017
పెద్దనోట్లను రద్దు చేస్తూ గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అనేక రంగాలపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం బంగారంపైనా పడింది. నవంబర్ 8 తర్వాత బంగారానికి డిమాండ్ తగ్గడంతో పాటు డిసెంబర్-జనవరి మధ్యకాలంలో దిగుమతులు కూడా భారీగా తగ్గాయి. నవంబర్ నెలలో 119.2 టన్నులుగా ఉన్న బంగారం దిగుమతి.. డిసెంబర్ నెలలో 54.1 టన్నులకు పడిపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలోనూ మరింత తగ్గి 53.2 టన్నులకు పరిమితమైంది. గతేడాది జనవరితో పోలిస్తే 43 శాతం పసిడి దిగుమతులు పడిపోయాయి. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో భారీగా నోట్ల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. పెద్దనోట్ల రద్దు తర్వాత పాత నోట్లను వదిలించుకునేందుకు ప్రజలు భారీగా బంగారం కొనుగోలుకు మొగ్గు చూపారు. అక్టోబర్తో పోలిస్తే నవంబర్లో దిగుమతులు పెరిగాయి. ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడంతో డిసెంబర్, జనవరి నెలల్లో దిగుమతుల్లో భారీ క్షీణత నమోదైందని తెలిపింది.
దేశంలో 80శాతం మంది బంగారు ఆభరణాలను నగదు ద్వారానే కొనుగోలు చేస్తారు. నవంబర్ 8 తర్వాత అలా కొనుగోలు చేసే వారి సంఖ్యా క్రమంగా పడిపోయింది. బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. గత ఆర్థిక సంవత్సరంలో 892.2 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి కాగా, ప్రస్తుతం ఏప్రిల్-జనవరి మధ్యకాలంలో అది 546 టన్నులకు పరిమితమైంది.
ఇక 2015-16 సంవత్సరంలో అత్యధికంగా 986 టన్నుల బంగారం దిగుమతి అయ్యింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







