నటి కీర్తీసురేశ్ను వరించిన సౌత్ఇండియన్ యూత్ ఐకాన్ అవార్డు
- March 13, 2017
పెరంబూర్; సౌత్ ఇండియన్ యూత్ ఐకాన్ అవార్డు నటి కీర్తీసురేశ్ను వరించింది. ది రిట్జ్ స్టైల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక రామాపురంలోని ఒక నక్షత్ర హోటల్లో ఆడంబరంగా జరిగింది. దక్షిణాదికి చెందిన సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు అందించే ఈ అవార్డుల కార్యక్రమాన్ని రిట్జ్ పత్రిక సంస్థ నిర్వాహకురాలు అరుణ నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసిన ఈ అవార్డుల వేదికపై యువ నటి కీర్తీసురేశ్ సౌత్ ఇండియన్ యూత్ ఐకాన్ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కళాశాల రోజుల నుంచి రిట్జ్ పత్రికను చదువుతున్నానన్నారు.
అలాంటిది ఆ పత్రిక పేరుతో అందిస్తున్న ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నటుడు శివకార్తీకేయన్ మాట్లాడుతూ అవార్డులు కళాకారులకు ప్రోత్సాహకంగా ఉంటాయన్నారు. అలాగని వాటిని తలకెక్కించుకోరాదని పేర్కొన్నారు. నటి క్యాథరిన్ ట్రెసా, సంగీతదర్శకుడు అనిరుద్, నటి, మిస్ ఇండియా శోభిత ధూళిపాళ, క్రికెట్ క్రీడాకారుడు అమిత్ మిశ్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ముందుగా అందాల బామలు క్యాట్వాక్ ఆహుతులను అలరించింది.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









