పాకిస్తాన్ డ్రైవర్నుమెచ్చిన సౌదీ యువరాజు
- March 14, 2017
అత్యంత ధైర్య సాహసాలతో, సమయస్పూర్థితో ఓ సౌదీ కుటుంబాన్ని కాపాడిన పాకిస్తానీ డ్రైవర్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా సౌదీ యువరాజు సౌద్ బిన్ నయూఫ్ అతడిని సత్కరించి సన్మానించారు. పవిత్ర మక్కాను దర్శించేందుకు సదుపాయం కల్పించారు. మనామాలో ఆదివారం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు మంటల్లో చిక్కుకుపోయింది. లోపల ఓ సౌదీ కుటుంబం కాపాడండంటూ వేడుకుంటున్నా.. చాలామంది చుట్టూ చేరి వేడుక చూస్తున్నారు. సెల్ఫోన్ తీసి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అయితే అటుగా వెళ్తున్న వాటర్ ట్యాంక్ డ్రైవర్ మహ్మద్ మన్సూర్ మాత్రం అందరిలా చూస్తూ ఊరుకోలేదు. హుటాహుటిన కిందకు దిగి.. వాటర్ ట్యాంక్లోని నీటిని కారు మంటలను ఆపేందుకు ఉపయోగించాడు. వారిని బయటకు తీసి.. ప్రాథమిక చికిత్స చేశాడు.. ఈలోపు అక్కడికి వచ్చిన అంబులెన్స్లో వారిని దగ్గరుండి ఎక్కించాడు. మన్సూర్ చేసిన సాహస కృత్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు కొందరు పౌరులు. ఇది కాస్తా వైరల్ అయి సౌదీ రియల్ హీరోగా మారిపోయాడు. ఈ విషయం సౌదీ యువరాజు నయూఫ్కు తెలిసి.. పాకిస్తాన్కు చెందిన మన్సూర్ను అభినందనలతో ముంచెత్తారు. తన వద్దకు రప్పించుకుని సన్మానించి, మక్కా యాత్రకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేశామని తెలియజేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







