హజ్ తొక్కిసలాట: యాత్రీకులకు యూఏఈ భరోసా
- September 25, 2015
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఏఈ అధికారిక హజ్ మిషన్ ప్రతినిథులతో టెలిఫోన్లో సంభాషించారు. హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట గురించి ఆరా తీసిన షేక్ మహ్మద్, యూఏఈ యాత్రీకులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. ఇస్లామిక్ అఫైర్స్ మరియు ఎండోమెంట్స్ జనరల్ అథారిటీ ఛైర్మన్, యూఏఈ హజ్ మిషన్ అధికారి డాక్టర్ మొహమ్మద్ మతార్ అల్ కాబి మాట్లాడుతూ, షేక్ మహ్మద్ హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై కలత చెందారనీ, యూఏఈ యాత్రీకుల భద్రతపై ఆయన ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నారనీ, యూఏఈ యాత్రీకుల క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థన కూడా చేశారనీ, మృతుల అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారనీ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందించమని షేక్ మహ్మద్ చెప్పారన్నారు కాబీ. తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి చాలా దూరంగానే యూఏఈ యాత్రీకులు చాలావరకు ఉన్నారనీ, వారికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గురువారం వార్షిక హజ్ యాత్ర సందర్భంగా మీనాలో జరిగిన తొక్కిసలాటలో 717 మంది మృత్యువాత పడిన విషయం తెలిసినదే.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







