ఉగ్ర హెచ్చరికలు తాజ్మహల్కు
- March 16, 2017
అద్భుత చారిత్రక కట్టడం తాజ్మహల్పై దాడి చేపడతామని భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుకూల వార్తా విభాగం హెచ్చరించింది. తాజ్మహల్ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తున్న ఓ గ్రాఫిక్స్నూ విడుదలచేసింది. ఐఎస్ కార్యకలాపాలపై నిఘా పెట్టే ‘సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్’ ఈ విషయాలను వెల్లడించింది. ఐఎస్ మీడియా విభాగం ‘అహ్వాల్ ఉమాత్’ ఓ ముష్కర యాప్లో గత మంగళవారం పెట్టిన ఈ గ్రాఫిక్స్ను సంస్థ వెలుగులోకి తెచ్చింది. దీనిలో ‘న్యూ టార్గెట్’అని రాసివుంది. ఆత్మాహుతి దాడి చేపడతామనే అర్థంవచ్చే అరబిక్ పదాలూ పక్కనవున్నాయి. భారత్లో దాడులు చేపడతామని ఐఎస్ అనుకూల వార్తా సంస్థలు హెచ్చరించడం ఇదేమీ తొలిసారికాదు.
లఖ్నవూలో ఈ నెల 8న అనుమానిత ఉగ్రవాది సైఫుల్లాను పోలీసులు హతమార్చిన సంగతి తెలిసిందే. అతణ్ని భారత్లోని ఖలీఫా సైనికుడిగా ఓ ముష్కర వార్తా సంస్థ పేర్కొంది. అతడి చిత్రాన్నీ ప్రచురించింది. అయితే ఈ చిత్రాన్ని అంతకుముందురోజే ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విడుదలచేయడం గమనార్హం.
సైఫులా ఐఎస్ ఉగ్రవాది కాకపోవచ్చని, తనకుతానుగానే ఉగ్రవాదంపైపు అతడు ఆకర్షితుడై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









