ఉగ్ర హెచ్చరికలు తాజ్మహల్కు
- March 16, 2017
అద్భుత చారిత్రక కట్టడం తాజ్మహల్పై దాడి చేపడతామని భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుకూల వార్తా విభాగం హెచ్చరించింది. తాజ్మహల్ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తున్న ఓ గ్రాఫిక్స్నూ విడుదలచేసింది. ఐఎస్ కార్యకలాపాలపై నిఘా పెట్టే ‘సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్’ ఈ విషయాలను వెల్లడించింది. ఐఎస్ మీడియా విభాగం ‘అహ్వాల్ ఉమాత్’ ఓ ముష్కర యాప్లో గత మంగళవారం పెట్టిన ఈ గ్రాఫిక్స్ను సంస్థ వెలుగులోకి తెచ్చింది. దీనిలో ‘న్యూ టార్గెట్’అని రాసివుంది. ఆత్మాహుతి దాడి చేపడతామనే అర్థంవచ్చే అరబిక్ పదాలూ పక్కనవున్నాయి. భారత్లో దాడులు చేపడతామని ఐఎస్ అనుకూల వార్తా సంస్థలు హెచ్చరించడం ఇదేమీ తొలిసారికాదు.
లఖ్నవూలో ఈ నెల 8న అనుమానిత ఉగ్రవాది సైఫుల్లాను పోలీసులు హతమార్చిన సంగతి తెలిసిందే. అతణ్ని భారత్లోని ఖలీఫా సైనికుడిగా ఓ ముష్కర వార్తా సంస్థ పేర్కొంది. అతడి చిత్రాన్నీ ప్రచురించింది. అయితే ఈ చిత్రాన్ని అంతకుముందురోజే ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విడుదలచేయడం గమనార్హం.
సైఫులా ఐఎస్ ఉగ్రవాది కాకపోవచ్చని, తనకుతానుగానే ఉగ్రవాదంపైపు అతడు ఆకర్షితుడై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







