5 నుండి 8 ఏళ్ళ వయసున్న పిల్లల కోసం కదిలే బండ్లని ఓఎఎ పరిచయం
- March 17, 2017
5 నుండి 8 ఏళ్ళ వయసున్నపిల్లల కోసం కదిలే బండ్లని (గో -కార్ట్స్) ఆటోమొబైల్స్ అసోసియేషన్ ( ఓఎఎ ) కొనుగోలు చేసింది. మంగళవారం ఓఎఎ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. అల్ రాఫ్డ్ ఫండ్ సీఈఓ తారిక్ బిన్ సులైమాన్ అల్ ఫార్సీ ఆధ్వర్యంలో ఈ ప్రయోగ కార్యక్రమం జరిగింది. దీనికి అధికారులు, మీడియా సిబ్బంది మరియు క్రీడా కారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఓఎఎ డైరెక్టర్ల బోర్డు యొక్క ఉపాధ్యక్షుడు బ్రిగేడియర్ జమాల్ బిన్ జాడి అల్ తాయి మాట్లాడుతూ బాల్యం నుంచే ట్రాఫిక్ భద్రత పై పిల్లలకు ఆహ్లాదంతో కూడిన అవగాహన కల్పించడం ఒక విధానం కాగా అదనంగా ఆ వయస్సులో పిల్లలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని ఆయన వివరించారు.పిల్లలలో ట్రాఫిక్ భద్రతపై పరిజ్ఞాన భావాన్ని మెరుగుపర్చే కార్యక్రమంగా దీనిని అభివర్ణిస్తూ మస్కట్ స్పీడ్ సర్క్యూట్, ఓఎఎ మేనేజర్ లోని బిన్ జాఫర్ అల్ బెంగాలీ ఈ సందర్భంగా తెలిపారు.సర్క్యూట్పై ప్రజంటేషన్ మరియు ఉపయోగపడే పది కొత్త గో కార్ట్స్ పనితీరు గురించి వివరించారు.ఓఎఎ జనరల్ మేనేజర్ సులైమాన్ బిన్ అబ్దుల్లాహ్ అల్ రావాహి ముఖ్య అతిథిగా పాల్గొని కార్ట్స్ పని తీరు గూర్చి అవలోకనాన్నికల్పించారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









