మరో మైలురాయి రెహ్మాన్ కీర్తిసిగలో
- March 17, 2017
'వన్ హార్ట్'తో కల నెరవేర్చుకుంటున్న ఆస్కార్ విజేత
భారత తొలి ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ కీర్తిసిగలో మరో అరుదైన మైలురాయి చేరబోతోంది. ఈ ఏడాదితో 25 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న రెహ్మాన్ మ్యూజిక్ కన్సర్ట్ వెండితెరపై ప్రదర్శితం కాబోతోంది. దివంగత పాప్రారాజు మైఖేల్ జాక్సన్ మ్యూజిక్ షో 'దిస్ ఈజ్ఇట్'ను గతంలో మ్యూజికల్ మూవీగా విడుదల చేయగా, సంగీతాభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అదే తరహాలోనే భారత్లో తొలిసారిగా ఏఆర్ రెహ్మాన్ కన్సర్ట్ను సినిమాగా విడుదల చేయబోతున్నారు. ఉత్తర అమెరికాలోని 10 నగరాల్లో నిర్వహించిన రెహ్మాన్ మ్యూజిక్ టూర్ను 'వన్ హార్ట్' పేరుతో వచ్చే ఏప్రిల్ మాసంలో విడుదల చేయనున్నారు.
వైఎం మూవీస్, గ్రేప్ వెంచర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించగా, టొరంటోని స్కాటియా బ్యాంక్ సినిమా హాలులో ఇదివరకే ప్రీమియర్ను ప్రదర్శించారు. సంగీత పరిశ్రమలోని సీనియర్లకు సాయం చేయాలన్నదే తన కలని ఎప్పుడూ చెప్పే రెహ్మాన్ 'వన్ హార్ట్' సినిమా ద్వారా నిధిని వారికే కేటాయించనున్నారు. వన్ హార్ట్ మ్యుజీషియన్స్ ఫౌండేషన్ ఒక కార్పస్ ఫండ్ని ఏర్పాటుచేసి సంగీత కళాకారులు, వారి కుటుంబాలను ఆదుకోనుండగా, ఈ ఫౌండేషన్కి రెహ్మాన్ బ్రాండ్ అంబాసడర్గా కూడా వున్నారు.
తాజా వార్తలు
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్









