సౌదీలో లేబర్ ఉల్లంఘనుల కోసం 90 రోజుల అమ్నెస్టీ
- March 20, 2017
ఇంటీరియర్ మినిస్ట్రీ, 'ఎ నేషన్ వితౌట్ వయొలేషన్స్' పేరుతో క్యాంపెయిన్ని ప్రారంభించింది. 90 రోజుల్లో ఉల్లంఘనలు, దేశం విడిచి వెళ్ళేందుకు ఈ అమ్నెస్టీ అవకాశం కల్పిస్తోంది. ఎలాంటి పెనాల్టీలూ విధించకుండా ఈ అవకాశం కల్పిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారు ఈ అమ్నెస్టీని మంచి అవకాశంగా తీసుకోవాలని క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ చెప్పారు. మార్చ్ 29 నుంచి ఈ అమ్నెస్టీ అమల్లోకి వస్తుంది. దేశం విడిచి వెళ్ళాలనుకునేవారికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా అన్ని విభాగాలకూ తగు సూచనలు చేశారు క్రౌన్ ప్రిన్స్. ఇంటీరియర్ మినిస్ట్రీ అధికార ప్రతినిథి మేజర్ జనరల్ మన్సౌర్ అల్ టుర్కి మాట్లాడుతూ, 19 ప్రభుత్వ శాఖలు ఈ క్యాంపెయిన్ని చేపట్టనున్నట్లు వివరించారు. హజ్ లేదా ఉమ్రా విజిట్ కోసం వచ్చి, ఎక్కువ కాలం ఇక్కడే అక్రమంగా నివసిస్తున్నవారు కూడా ఈ అమ్నెస్టీకి అర్హులని ఆయన తెలిపారు. అమ్నెస్టీ పీరియడ్ని వినియోగించుకోని ఉల్లంఘనులపై అమ్నెస్టీ ముగిసిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయి.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









