సౌదీలో లేబర్ ఉల్లంఘనుల కోసం 90 రోజుల అమ్నెస్టీ
- March 20, 2017
ఇంటీరియర్ మినిస్ట్రీ, 'ఎ నేషన్ వితౌట్ వయొలేషన్స్' పేరుతో క్యాంపెయిన్ని ప్రారంభించింది. 90 రోజుల్లో ఉల్లంఘనలు, దేశం విడిచి వెళ్ళేందుకు ఈ అమ్నెస్టీ అవకాశం కల్పిస్తోంది. ఎలాంటి పెనాల్టీలూ విధించకుండా ఈ అవకాశం కల్పిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారు ఈ అమ్నెస్టీని మంచి అవకాశంగా తీసుకోవాలని క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ చెప్పారు. మార్చ్ 29 నుంచి ఈ అమ్నెస్టీ అమల్లోకి వస్తుంది. దేశం విడిచి వెళ్ళాలనుకునేవారికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా అన్ని విభాగాలకూ తగు సూచనలు చేశారు క్రౌన్ ప్రిన్స్. ఇంటీరియర్ మినిస్ట్రీ అధికార ప్రతినిథి మేజర్ జనరల్ మన్సౌర్ అల్ టుర్కి మాట్లాడుతూ, 19 ప్రభుత్వ శాఖలు ఈ క్యాంపెయిన్ని చేపట్టనున్నట్లు వివరించారు. హజ్ లేదా ఉమ్రా విజిట్ కోసం వచ్చి, ఎక్కువ కాలం ఇక్కడే అక్రమంగా నివసిస్తున్నవారు కూడా ఈ అమ్నెస్టీకి అర్హులని ఆయన తెలిపారు. అమ్నెస్టీ పీరియడ్ని వినియోగించుకోని ఉల్లంఘనులపై అమ్నెస్టీ ముగిసిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయి.
తాజా వార్తలు
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!







