ఎ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ కాన్సెర్ట్
- March 20, 2017
షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన లైవ్ కాన్సెర్ట్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్, ఆహూతులైన 20,000 మందిని ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించారు, తన పాటలతో హోరెత్తించారు. షార్జాలో తొలిసారిగా ఇంత పెద్ద వేదికను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకుల్ని అభినందించారాయన. ఎల్ఈడీ స్క్రీన్లతో ఆహూతులకు సరికొత్త అనుభూతిని మిగిల్చారు. ఎక్కువగా మలయాళ, తమిళ పాటలతో హోరెత్తించారు రెహమాన్. మూడ గంటల పాటు సాగిన ఈ షో ఆహూతుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. దిల్సె, ఏ జో దేష్ హై మేరా, చయ్యా చయ్యా, ముస్తఫా ముస్తపా, జనగనమన వంటి పాటల్ని ఆలపించిన రెహ్మాన్, ఆహూతులు కూడా తనతో గొంతు కలిపేలా, పాదం కలిపేలా చేయగలిగారు. మధ్య మధ్యలో శ్వేతా మోహన్, కార్తీక్, మెన్నీ దయాల్, రంజిత్ బరోత్, హరిహరన్, జోనితా గాంధీ, నీతి మోహన్, ఆల్ఫాన్స్ జోసెఫ్, జావెద్ అలి తదితరులు వేదికపై సందడి చేశారు. మనసు మనసింతే పాటతో, తన తండ్రి ఆర్కె శేఖర్కి నివాళులర్పించారు రెహమాన్.
తాజా వార్తలు
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!









