కామెల్ కాన్వాయ్లో ఉల్లాసంగా ఉత్సాహంగా
- March 20, 2017
తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో 9 కిలోమీటర్ల మేర కామెల్ కాన్వాయ్లో 400 మంది పాల్గొన్నారు. నార్త్ బతినా గవర్నరేట్ పరిధిలోని ఖబౌరాలో గల వాడి అల్ హవ్స్నా నుంచి ఈ ట్రిప్ ప్రారంభమయ్యింది. రిటైర్డ్ మేజర్జనరల్ సైద్ బిన్ నాజర్ అల్ సల్మి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తానేట్ పరిధిలోని పలు గవర్నరేట్స్కి చెందిన పలువురు ఈ కాన్వాయ్లో పాల్గొన్నారని నాజర్ అల్ హోస్ని అనే పార్టిసిపెంట్ చెప్పారు. వీరిలో యూకే మరియు యుఎస్ నుంచి వచ్చిన విదేశీ ప్రతినిథులు కూడా ఉన్నారు. 9 కిలోమీటర్ల ఈ యాత్రను పూర్తి చేయడానికి 3 గంటల సమయం పట్టింది. అత్యంత క్లిష్టతరమైన ఈ రవాణా మార్గంలో తమ పూర్వీకులు పడ్డ కష్టం గురించి యాత్రలో పాల్గొన్నవారంతా తెలుసుకున్నారు. డొమెస్టిక్ టూరిజంని ప్రమోట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడ్తాయనీ, ఈ టూర్ ప్రతి యేడాదీ కొనసాగించాలని తాము కోరుకుంటున్నామని హోస్నీ చెప్పారు. కార్లో ముందుగా గమ్యాన్ని చేరుకున్న ఇద్దరు ఒమనీయుల్ని మేజర్ జనరల్ సల్మి సత్కరించారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







