బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్‌

- March 21, 2017 , by Maagulf
బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్‌

ప్రైవేటు రంగ టెలికాం సంస్థల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకొనేందుకు ప్రభుత్వ రంగ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తన వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.339 రీఛార్జ్‌ చేయడం ద్వారా రోజుకు 2జీబీ డేటాను అందించనుంది. ‘జియోతో సహా ఇతర టెలికాం సంస్థల కన్నా అతి తక్కువ ధరకు డేటాను అందించనున్నాం. రూ.339లకే రోజుకు 2జీబీ డేటాను నెల రోజుల పాటు పొందవచ్చు’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌ త్యాగి తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఆఫర్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్టు త్యాగి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com