అమెరికా ఆంక్షలు వివిధ దేశాలనుంచి వచ్చే ముస్లింలపై
- March 22, 2017
ఉగ్రవాద దాడి ముప్పు దృష్ట్యా ముస్లింల జనాభా అధికంగా ఉండే వివిధ దేశాల నుంచి తమ దేశాలకు విమానాల్లో వచ్చే వారిపై భద్రతాపరమైన ఆంక్షలను అమెరికా, బ్రిటన్ కఠినతరం చేశాయి. అమెరికా ఎనిమిది దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై, బ్రిటన్ ఆరు దేశాల నుంచి వచ్చే వారిపై తాజా ఆంక్షలను విధించాయి. సౌదీ అరేబియా, ఈజిప్టు. టర్కీ,జోర్డాన్, యూఏఈ, ఖతార్, మొరాకో, కువైట్ల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులు ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఐపాడ్లు, ఈ-రీడర్లు, కెమెరాలు, పెద్దగా ఉండే ఇతర ఎలక్ట్రానిక్ సాధనాలను విమానంలో క్యాబిన్ లగేజీ గా వెంట ఉంచుకునేందుకు వీల్లేదని ప్రకటించింది. వీటిని కార్గో భాగంలో ఉంచుతారు. ట్రంప్ ప్రభుత్వం మంగళవారం ఈ విషయమై ఉత్తర్వు జారీ చేసింది. అమెరికాకి వచ్చే 50కి పైగా విమానాలపై ఉత్తర్వు ప్రభావం వుంటుంది. నిర్దేశిత పరిమాణాన్ని మించి ఉండే ఫోన్లు, ట్యాబ్లు, డీవీడీ ప్లేయర్లపైనా ఆంక్షలు విధించింది.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









