40 కి పైగా ఇస్లామిక్ చేతివ్రాత పని భాగాలు భారతీయ ఎగ్జిబిషన్ లో ప్రదర్శన

- March 22, 2017 , by Maagulf
40 కి పైగా ఇస్లామిక్ చేతివ్రాత పని భాగాలు భారతీయ ఎగ్జిబిషన్ లో ప్రదర్శన

ఖురాన్ నుండి ఎంపిక చేసిన పవిత్ర వాక్యాలను కళాత్మకంగాఇస్లామిక్ చేతివ్రాతతో రాసిన 40  కంటే ఎక్కువ భాగాలను ఓమాని సొసైటీ ఫైన్ ఆర్ట్స్ ప్రదర్శనలో ఉంచారు.ఈ కార్యక్రమం ద్వారా ఇండో-ఇస్లామిక్ నగీషీ సంప్రదాయంను మరింతగా  ఆసక్తి పెంపొందించేందుకు నేర్చుకొనేందకు ఓ లక్ష్యం కానుంది. ఒమాన్ లో భారతదేశ రాయబారి ఇ ఇంద్ర మణి పాండే కాలిగ్రఫీ ఇస్లామిక్ సంప్రదాయాలకు భారతదేశం అంతర్భాగంగా ఉందని ఆయన అన్నారు. భారతదేశం లో దాని స్వంత కాలిగ్రఫీ ప్రత్యేక లక్షణాలు సాధించటం శతాబ్దాలుగా రూపొందించబడి ఉంది. భారత కాలిగ్రఫీ ఎగ్జిబిషన్ ఒమన్ ప్రజలకు ఎంతో  ఆసక్తిని కల్గిస్తుంది . అంతేకాక  భారతదేశ మరియు చేతివ్రాత యొక్క చరిత్ర అభివృద్ధి మరింత అవగాహన కల్గిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఖురాన్ లో అరుదైన 7 వ శతాబ్దపు పార్చ్మెంట్ కూఫీక్  లిపిలో రాసిన రాతప్రతి యొక్క దస్తావేజు హజ్రత్ ఆలీ (ఆర్ ఎ) ప్రదర్శించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ మొట్టమొదటిసారిగా ఒమన్ లో భారతదేశం ఉత్సవంలో భాగంగా గత ఏడాది చివర్లో ఒమన్ అవెన్యూస్ మాల్ వద్ద జరిగింది.పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షించింది. మార్చి 25 వరకు కొనసాగే ఎగ్జిబిషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంట వరకు  అలాగే సాయంత్రం 4.30 నుండి  రాత్రి 8 గంటల వరకూ సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com