రెంట్స్ చెల్లించలేనివారి కోసం 1 మిలియన్ దిర్హామ్ల డొనేషన్
- March 22, 2017
దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ (డిఎల్డి) - జ్యుడీషియల్ ఆర్మ్ 1 మిలియన్ దిర్హామ్ల డొనేషన్ని లేట్ ఒబైద్ అల్ హెలోయు కుటుంబం నుంచి అందుకుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ రెంట్స్ చెల్లించలేనివారి కోసం ఈ డొనేషన్ని వినియోగించనున్నారు. రెంటల్ డిస్ప్యూట్ సెంటర్ (ఆర్డిసి), ఓ కమిటీని ఏర్పాటు చేసి, రెంట్ వివాదాల్ని అధ్యయనం చేస్తుంది. ఈ సందర్భంగా ఆర్డిసి డైరెక్టర్ జడ్జ్ అబ్దుల్ఖాదర్ మౌసా మాట్లాడుతూ, లేట్ ఒబైద్ అల్ హెలోయూ కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆర్డిసి ముఖ్య ఉద్దేశ్యం టెనెంట్స్కీ ల్యాండ్లార్డ్స్కీ మధ్య సానుకూల వాతావరణం సృష్టించడమేనని ఆయన చెప్పారు. క్లిష్టపరిస్థితుల్లో ఉన్న టెనెంట్స్కి మాత్రమే ఉపయోగపడేలా తమకు అందిన నిధుల్ని ఖర్చు చేస్తామని మౌసా చెప్పారు. ఇయర్ ఆఫ్ గివింగ్లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు మౌసా వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









