లండన్‌ ఉగ్రదాడి ఘటన విచారకరం: మోదీ

- March 22, 2017 , by Maagulf
లండన్‌ ఉగ్రదాడి ఘటన విచారకరం: మోదీ

లండన్‌లోని బ్రిటిష్‌ పార్లమెంట్‌ సమీపంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా అయిదుగురు మరణించగా, సుమారు 40 మంది గాయాలపాలయ్యారు. దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. లండన్‌లో ఉగ్రదాడి చాలా బాధాకరమని, ఇలాంటి విపత్కర సమయంలో బ్రిటన్‌కు భారత్‌ బాసటగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబసభ్యులకు ఆయన సంతాపం తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులో బ్రిటన్‌కు భారత్‌ మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com