కిడ్నాప్‌, వేధింపుల కేసులో ముగ్గురికి జైలు

- March 25, 2017 , by Maagulf
కిడ్నాప్‌, వేధింపుల కేసులో ముగ్గురికి జైలు

దోహా క్రిమినల్‌ కోర్ట్‌ ముగ్గురు బంగ్లాదేశీ వ్యక్తులకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్‌ చేసి, వారిని హింసించిన నేరానికి గాను ఈ జైలు శిక్ష విధించడం జరిగింది. బాధితుల్ని కిడ్నాప్‌ చేసి, వారి బంధువుల్ని బ్లాక్‌మెయిల్‌ చేయడానికి నిందితులు ప్లాన్‌ చేశారు. బాధితులు నివాసం ఉంటున్న చోటకు వెళ్ళి, బలవంతంగా డోర్‌ తెరిచి, కారులో వారిని కిడ్నాప్‌ చేశారు నిందితులు. అనంతరం వారి నుంచి బలవంతంగా వారి బంధువుల వివరాల్ని సేకరించారు. ఓ వ్యక్తి, కిడ్నాప్‌కి వినియోగించిన వాహనం నెంబర్‌ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com