15 యూఎస్ కంపెనీలపై ఆంక్షలు విధించనున్న ఇరాన్

- March 26, 2017 , by Maagulf
15 యూఎస్ కంపెనీలపై ఆంక్షలు విధించనున్న ఇరాన్

అమెరికాకు చెందిన 15 కంపెనీలపై ఇరాన్ ఆంక్షలు విధించింది. డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ రేథియాన్, యునైటెడ్ టెక్నాలజీస్, ఐటీటీ, ఒష్‌కోష్ కార్పొరేషన్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. యూఎస్‌కు చెందిన ఈ కంపెనీలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు ఇజ్రాయెల్‌కు సహకరించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆరోపించింది. ఆ కంపెనీల కాంట్రాక్ట్‌లను రద్దు చేయడంతో పాటు వాటి ఆస్తులను సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి పోగ్రామ్‌కు సాంకేతిక సహకారం అందిస్తున్న చైనా, ఉత్తర కొరియా, యూఏఈలకు చెందిన 11 కంపెనీలపై అమెరికా రెండు రోజుల కిందట ఆంక్షలు విధించింది. దీనికి బదులుగా అమెరికాకు చెందిన 15 కంపెనీలపై ఇరాన్ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com