15 యూఎస్ కంపెనీలపై ఆంక్షలు విధించనున్న ఇరాన్
- March 26, 2017
అమెరికాకు చెందిన 15 కంపెనీలపై ఇరాన్ ఆంక్షలు విధించింది. డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ రేథియాన్, యునైటెడ్ టెక్నాలజీస్, ఐటీటీ, ఒష్కోష్ కార్పొరేషన్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. యూఎస్కు చెందిన ఈ కంపెనీలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు ఇజ్రాయెల్కు సహకరించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆరోపించింది. ఆ కంపెనీల కాంట్రాక్ట్లను రద్దు చేయడంతో పాటు వాటి ఆస్తులను సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి పోగ్రామ్కు సాంకేతిక సహకారం అందిస్తున్న చైనా, ఉత్తర కొరియా, యూఏఈలకు చెందిన 11 కంపెనీలపై అమెరికా రెండు రోజుల కిందట ఆంక్షలు విధించింది. దీనికి బదులుగా అమెరికాకు చెందిన 15 కంపెనీలపై ఇరాన్ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









