ఇకపై పాస్పోర్ట్ కు ఆధర్ తప్పనిసరి.!
- September 28, 2015
పాస్పోర్టుకు ఆధార్ నంబర్ అనుసంధానం చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 7 పాస్పోర్ట్ సేవా కేంద్రా ల్లో తొలుత ఈ ప్రక్రియను చేపట్టింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, చండీగఢ్, రాంచిలతో పాటు విశాఖ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఆధార్ అనుసంధాన ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ విజయవంతమైతే దేశంలోని అన్ని పాస్పోర్టు సేవా కేంద్రాల్లో ప్రారంభించాలని కసరత్తు చేస్తోంది. సాధారణంగా ఆధార్ నంబర్ను పాస్పోర్టుకు అనుసంధానించడమంటే.. రెండింటికీ సంబంధించి వేలిముద్రలు, ఐరిష్ (కనుపాప)లను సరిపోల్చి నిర్ధారిస్తారు. బయోమెట్రిక్ వివరాలను కూడా సరిపోల్చుతారు. దీన్నే 'డిజిటల్ ఇంటిగ్రేట్ డేటా బేస్' అని అంటారు. ఇలా పాస్పోర్టుకు ఆధార్ను అనుసంధానించడం వల్ల నకిలీలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదని విదేశీ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడుతోంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







