ఉత్తరప్రదేశ్ లో బాంబు పేలుడు
- March 28, 2017
ఉత్తరప్రదేశ్ లోని సంత కబీర్ నగర్ లోని రైల్వే ట్రాక్ సమీపంలో మంగళవారం ఉదయం బాంబు పేలిపోవడంతో స్థానికులు హడలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
రైల్వే ట్రాక్ సమీపంలో నాలుగు నాటు బాంబులను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ట్రాక్ సమీపంలో తక్కువ సామర్థ్యం ఉన్న నాటు బాంబు పేలిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
విషయం తెలుసుకున్న ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే ఇది ఉగ్రవాదుల దాడికాదని అధికారులు అంటున్నారు. స్వాధీనం చేసుకున్న నాటు బాంబులను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.
పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









