ఆస్ట్రేలియాపై “భారత్” ఘనవిజయం

- March 28, 2017 , by Maagulf
ఆస్ట్రేలియాపై “భారత్” ఘనవిజయం

ఆస్ట్రేలియా తో జరుగుతున్నా సిరీస్ లో మొదటి మ్యాచ్ లో భారీ ఓటమిని రుచి చూసిన భారత జట్టు రెండో టెస్టులో ఆస్ట్రేలియా పై అనూహ్య విజయం సాధించి ఫాన్స్ ని ఆనందాశ్చర్యాలకు గురి చేసింది. మూడో టెస్టు డ్రా గా ముగిసింది. దాంతో క్రికెట్ అభిమానులు నాలుగో టెస్ట్ పై ఎంతో ఆసక్తి చూపించారు. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 300 పరుగులు చేయగా, భారత్ 332 పరుగులు చేసి ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 137 పరుగులకే కుప్పకూలింది. భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అత్యంత సునాయాసంగా ఒకరోజు మిగులుండగానే ఆట ముగించి సిరీస్ సొంతం చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com