వాహనదారులకు ఒమాన్ పోలీసుల హెచ్చరిక
- September 28, 2015
రాయల్ ఒమాన్ పోలీసులు, వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏటీఎంలలో డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు, చిన్న చిన్న షాపింగ్ కొరకు వెళుతూ, కార్ ఇంజన్ని ఆఫ్ చేయకపోవడం దొంగతనాలకు ఆస్కారం కల్పిస్తుందని రాయల్ ఒమన్ పోలీసులు వాహనదారులకు చేసిన హెచ్చరికల్లో పేర్కొన్నారు. ఒక్క నిమిషం అయినాసరే కార్ని నిలుపుదల చేసి కిందకు దిగాలనుకుంటే వెంటనే ఇంజన్ని ఆఫ్ చేసి, కార్ని లాక్ చేసుకోవాలని సూచించారు. వాహన దొంగతనాల్లో ఎక్కువగా మస్కట్లోనే జరుగుతున్నట్లు గుర్తించామనీ, చాలా కేసుల్లో డ్రైవర్ లేకుండా కార్ ఇంజన్ ఆన్ చేసి ఉంటోందని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు. దొంగతనం చేసేవారు అనుక్షణం గమనిస్తుంటారనీ, వాహనదారులు చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా, దొంగలకు అవకాశమిచ్చినట్లేనన్నారు. కార్ డోర్ లాక్ చేయకపోవడం వల్ల వాటిల్లో విలువైన వస్తువులు దొంగిలించబడ్తున్నాయన్నారు పోలీసులు. కార్లను, వస్తువుల్ని దొంగలించి, బ్లాక్ మార్కెట్లో వాటిని అమ్మేస్తున్నారనీ, దొంగ వస్తువులు లేదా కార్లను అమ్మే స్క్రాప్ దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెబుతూ, ఆర్టికల్ 279 ప్రకారం 3 నెలల నుంచి మూడేళ్ళ జైలుతోపాటు 10 నుంచి 500 ఒమాన్ రియాల్స్ జరిమానా కూడా విధించబడ్తుందని అన్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







