వాహనదారులకు ఒమాన్ పోలీసుల హెచ్చరిక
- September 28, 2015
రాయల్ ఒమాన్ పోలీసులు, వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏటీఎంలలో డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు, చిన్న చిన్న షాపింగ్ కొరకు వెళుతూ, కార్ ఇంజన్ని ఆఫ్ చేయకపోవడం దొంగతనాలకు ఆస్కారం కల్పిస్తుందని రాయల్ ఒమన్ పోలీసులు వాహనదారులకు చేసిన హెచ్చరికల్లో పేర్కొన్నారు. ఒక్క నిమిషం అయినాసరే కార్ని నిలుపుదల చేసి కిందకు దిగాలనుకుంటే వెంటనే ఇంజన్ని ఆఫ్ చేసి, కార్ని లాక్ చేసుకోవాలని సూచించారు. వాహన దొంగతనాల్లో ఎక్కువగా మస్కట్లోనే జరుగుతున్నట్లు గుర్తించామనీ, చాలా కేసుల్లో డ్రైవర్ లేకుండా కార్ ఇంజన్ ఆన్ చేసి ఉంటోందని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు. దొంగతనం చేసేవారు అనుక్షణం గమనిస్తుంటారనీ, వాహనదారులు చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా, దొంగలకు అవకాశమిచ్చినట్లేనన్నారు. కార్ డోర్ లాక్ చేయకపోవడం వల్ల వాటిల్లో విలువైన వస్తువులు దొంగిలించబడ్తున్నాయన్నారు పోలీసులు. కార్లను, వస్తువుల్ని దొంగలించి, బ్లాక్ మార్కెట్లో వాటిని అమ్మేస్తున్నారనీ, దొంగ వస్తువులు లేదా కార్లను అమ్మే స్క్రాప్ దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెబుతూ, ఆర్టికల్ 279 ప్రకారం 3 నెలల నుంచి మూడేళ్ళ జైలుతోపాటు 10 నుంచి 500 ఒమాన్ రియాల్స్ జరిమానా కూడా విధించబడ్తుందని అన్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







