పివిఆర్ సినిమాస్ లక్ష్యం రాబోవు ఐదేళ్లలో 1,000 స్ర్కీన్లు
- March 30, 2017మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పివిఆర్ వచ్చే ఐదేళ్ల కాలంలో రాబడిని రెండింతలు పెంచుకుని 4 వేల కోట్ల రూపాయలకు చేరుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఇదే కాలంలో స్ర్కీన్ల సంఖ్యను 1,000కి పెంచుకోవాలనుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 570 స్ర్కీన్లున్నాయని, వచ్చే నాలుగైదేళ్లలో వీటి సంఖ్యను 1,000కి చేర్చాలన్న లక్ష్యంతో ఉన్నామని పివిఆర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నితిన్ సూద్ తెలిపారు.
ఈ స్థాయికి చేరితే కంపెనీ రాబడి రూ.3,500-4,500 కోట్లకు చేరుకుంటుందని ఆయన చెప్పా రు. 2015-16 సంవత్సరంలో కంపెనీ రాబడి 1,743.98 కోట్ల రూపాయలు గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 2,100 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని సూద్ తెలిపారు. మూడేళ్ల కాలంలో స్ర్కీన్ల సంఖ్య ను పెం చడం వల్ల తమ థియేటర్లలో సినిమాలు చూసే వీక్షకుల సంఖ్య ప్రస్తుతమున్న 7.5 కోట్ల నుంచి 10 కోట్లకు చేరుకుంటుందని సూద్ పేర్కొ న్నారు.
ప్రస్తుతం 50కి పైగా నగరాల్లో పివిఆర్ థియేటర్లున్నాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్