పివిఆర్ సినిమాస్ లక్ష్యం రాబోవు ఐదేళ్లలో 1,000 స్ర్కీన్లు
- March 30, 2017
మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పివిఆర్ వచ్చే ఐదేళ్ల కాలంలో రాబడిని రెండింతలు పెంచుకుని 4 వేల కోట్ల రూపాయలకు చేరుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఇదే కాలంలో స్ర్కీన్ల సంఖ్యను 1,000కి పెంచుకోవాలనుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 570 స్ర్కీన్లున్నాయని, వచ్చే నాలుగైదేళ్లలో వీటి సంఖ్యను 1,000కి చేర్చాలన్న లక్ష్యంతో ఉన్నామని పివిఆర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నితిన్ సూద్ తెలిపారు.
ఈ స్థాయికి చేరితే కంపెనీ రాబడి రూ.3,500-4,500 కోట్లకు చేరుకుంటుందని ఆయన చెప్పా రు. 2015-16 సంవత్సరంలో కంపెనీ రాబడి 1,743.98 కోట్ల రూపాయలు గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 2,100 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని సూద్ తెలిపారు. మూడేళ్ల కాలంలో స్ర్కీన్ల సంఖ్య ను పెం చడం వల్ల తమ థియేటర్లలో సినిమాలు చూసే వీక్షకుల సంఖ్య ప్రస్తుతమున్న 7.5 కోట్ల నుంచి 10 కోట్లకు చేరుకుంటుందని సూద్ పేర్కొ న్నారు.
ప్రస్తుతం 50కి పైగా నగరాల్లో పివిఆర్ థియేటర్లున్నాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









