ప్రభుత్వం ప్రవాసులను ఆదుకోవాలని డిమాండ్
- March 30, 2017
గల్ఫ్ కార్మికుడి శవయాత్రలో ప్లకార్డులతో ప్రదర్శన. గల్ఫ్ దేశాలలోని వలస కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం (30.03.2017) న ఒక గల్ఫ్ కార్మికుడి శవయాత్రలో ప్లకార్డులతో పాల్గొన్న సంఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచంపల్లి లో జరిగింది. నిర్మల్ జిల్లా ప్రవాసి కార్మిక నాయకుడు పోతుగంటి సాయేందర్ ఆధ్వర్యంలో గ్రామస్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కూచంపల్లి కి చెందిన యెలిగాటి రాజేశ్వర్ తేది: 25.02.2017 మస్కట్, ఓమాన్ లో చనిపోయారు. దుబాయిలో ఉంటున్న ఇతని కుమారుడు వచ్చి అంత్యక్రియలలో పాల్గొన్నాడు.
ఓమాన్ లోని సామజిక కార్యకర్తలు లింగన్న, హరిబాబు శవాన్ని ఇండియాకు పంపుటకు కృషిచేశారు. తెలంగాణ ఎమిగ్రంట్స్ లేబర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోండ్ల గంగాప్రసాద్ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి కూచంపల్లి శవపేటిక రవాణాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నారై విభాగం వారు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
ఈ క్రింది డిమాండ్లతో గ్రామస్థులు శవయాత్రలో పాల్గొన్నారు
'తెలంగాణ ప్రవాసుల సంక్షేమం' పేరిట టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక-2014 లో వలసదారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి.
అధికారంలోకి వచ్చి 33 నెలలు అయింది ! ఇకనైనా పట్టించుకోండి మా ప్రవాసులను !
తెలంగాణ ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) రూపకల్పన అయ్యింది.. అమలు నిలిచింది.
గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో రూ. 100 కోట్లు కేటాయించాలి.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నారై సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయాలి.
సచివాలయంలో ఉన్న ఎన్నారై సెల్ ను సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా బయట ఏర్పాటు చేయాలి.
విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయం) ఇవ్వాలి.
గల్ఫ్ నుండి సంవత్సరానికి 200 మంది తెలంగాణ ప్రవాసీ బిడ్డలు చనిపోతున్నారు
శవపేటికల్లో తెలంగాణకు చేరుతున్నారు. 2 జూన్ 2014 నుండి ఈనాటి వరకు 500 మంది
తెలంగాణ ప్రవాసీ బిడ్డల మృతదేహాలు శవపేటికలలో హైదరాబాద్ ఏర్ పోర్ట్ ద్వారా ఇంటికి కు చేరుకున్నాయి. రాష్ట్రం నుండి విదేశాలకు జరిగే వలసలపై ప్రభుత్వం సమగ్రమైన సర్వే నిర్వహించాలి.
ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రవాసి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
వలసవెళ్ళే కార్మికులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చైతన్య సదస్సులు నిర్వహించాలి.
కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి.
విదేశాల నుండి అనుకోకుండా తిరిగి వచ్చిన వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి.
వలస పోయిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించవద్దు.
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి రిక్రూటింగ్ వ్యవస్తపై నిఘా ఏర్పాటు చేయాలి.
విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం చేసి విడుదల చేయాలి.
ఎం.భీమ్ రెడ్డి
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







