మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- January 25, 2026
మస్కట్: ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, నోవాస్పేస్తో కలిసి మిడిలీస్టు అంతరిక్ష సదస్సు రెండవ ఎడిషన్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది జనవరి 26న ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సదస్సు మంత్రిమండలి జనరల్ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ అయిన హిజ్ హైనెస్ సయ్యద్ డాక్టర్ కామిల్ బిన్ ఫహద్ అల్ సయీద్ ఆధ్వర్యంలో జరుగుతుంది.
కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతికత అండర్ సెక్రటరీ డాక్టర్ అలీ బిన్ అమేర్ అల్ షిధాని సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి 20కి పైగా దేశాల నుండి 190కి పైగా సంస్థలకు చెందిన 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. మిడిలీస్టులో అంతరిక్ష టెక్నాలజీ వృద్ధికి ఒమన్ సదస్సు మార్గనిర్దేశం చేస్తుందన్నారు.
ఈ సదస్సు నిర్వాహణ కారణంగా ఒమన్ లో అంతరిక్ష సంబంధిత ఇన్వెస్ట్ మెంట్స్ వచ్చే అవకాశం ఉందని, తద్వారా జీసీసీలో అంతరిక్ష రంగంలో ఒమన్ కీలకంగా మారుతుందని డాక్టర్ అలీ బిన్ అమేర్ పేర్కొన్నారు. అతిథులకు ఒమన్ లోని కీలక పర్యాటక ప్రదేశాలను పరిచయం చేయనున్నట్లు, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







