మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- January 25, 2026
మస్కట్: ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, నోవాస్పేస్తో కలిసి మిడిలీస్టు అంతరిక్ష సదస్సు రెండవ ఎడిషన్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది జనవరి 26న ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సదస్సు మంత్రిమండలి జనరల్ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ అయిన హిజ్ హైనెస్ సయ్యద్ డాక్టర్ కామిల్ బిన్ ఫహద్ అల్ సయీద్ ఆధ్వర్యంలో జరుగుతుంది.
కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతికత అండర్ సెక్రటరీ డాక్టర్ అలీ బిన్ అమేర్ అల్ షిధాని సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి 20కి పైగా దేశాల నుండి 190కి పైగా సంస్థలకు చెందిన 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. మిడిలీస్టులో అంతరిక్ష టెక్నాలజీ వృద్ధికి ఒమన్ సదస్సు మార్గనిర్దేశం చేస్తుందన్నారు.
ఈ సదస్సు నిర్వాహణ కారణంగా ఒమన్ లో అంతరిక్ష సంబంధిత ఇన్వెస్ట్ మెంట్స్ వచ్చే అవకాశం ఉందని, తద్వారా జీసీసీలో అంతరిక్ష రంగంలో ఒమన్ కీలకంగా మారుతుందని డాక్టర్ అలీ బిన్ అమేర్ పేర్కొన్నారు. అతిథులకు ఒమన్ లోని కీలక పర్యాటక ప్రదేశాలను పరిచయం చేయనున్నట్లు, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









