సెట్స్ పైకి నాగ శౌర్య కొత్త చిత్రం
- March 30, 2017
చందమామ కథలు చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగశౌర్య తర్వాత ఉహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, జాదూగాడు, జో అచ్యుతానంద, కళ్యాణ వైభోగమే, ఒక మనసు వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఉహలు గుసగుసలాడే సినిమా మాత్రమే మంచి విజయాన్ని సాధించింది. మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే. ఇప్పుడు కాస్తా గ్యాప్ తీసుకున్న నాగశౌర్య కొత్త సినిమాను స్టార్ట్ చేశాడట. త్రివిక్రమ్ వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన వెంకి కుడుముల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. కన్నడ నటి రిష్మిక మండన్న దీనిలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి, శంకర్ ప్రసాద్ మూల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రామానాయుడు స్టూడియోలో ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాకు అమ్మమ్మగారిల్లు అనే టైటిల్ పరిశీలనలో ఉందట. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్, దర్శక నిర్మాతల వివరాలు అధికారకంగా తెలుస్తాయి. కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాగర్ మహతి, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







