సెట్స్ పైకి నాగ శౌర్య కొత్త చిత్రం
- March 30, 2017
చందమామ కథలు చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగశౌర్య తర్వాత ఉహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, జాదూగాడు, జో అచ్యుతానంద, కళ్యాణ వైభోగమే, ఒక మనసు వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఉహలు గుసగుసలాడే సినిమా మాత్రమే మంచి విజయాన్ని సాధించింది. మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే. ఇప్పుడు కాస్తా గ్యాప్ తీసుకున్న నాగశౌర్య కొత్త సినిమాను స్టార్ట్ చేశాడట. త్రివిక్రమ్ వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన వెంకి కుడుముల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. కన్నడ నటి రిష్మిక మండన్న దీనిలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి, శంకర్ ప్రసాద్ మూల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రామానాయుడు స్టూడియోలో ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాకు అమ్మమ్మగారిల్లు అనే టైటిల్ పరిశీలనలో ఉందట. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్, దర్శక నిర్మాతల వివరాలు అధికారకంగా తెలుస్తాయి. కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాగర్ మహతి, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









