సెట్స్ పైకి నాగ శౌర్య కొత్త చిత్రం
- March 30, 2017చందమామ కథలు చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగశౌర్య తర్వాత ఉహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, జాదూగాడు, జో అచ్యుతానంద, కళ్యాణ వైభోగమే, ఒక మనసు వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఉహలు గుసగుసలాడే సినిమా మాత్రమే మంచి విజయాన్ని సాధించింది. మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే. ఇప్పుడు కాస్తా గ్యాప్ తీసుకున్న నాగశౌర్య కొత్త సినిమాను స్టార్ట్ చేశాడట. త్రివిక్రమ్ వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన వెంకి కుడుముల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. కన్నడ నటి రిష్మిక మండన్న దీనిలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి, శంకర్ ప్రసాద్ మూల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రామానాయుడు స్టూడియోలో ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాకు అమ్మమ్మగారిల్లు అనే టైటిల్ పరిశీలనలో ఉందట. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్, దర్శక నిర్మాతల వివరాలు అధికారకంగా తెలుస్తాయి. కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాగర్ మహతి, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు