మలేసియా ప్రధానికి మహ్మద్ నజీబ్ టున్ అబ్దుల్ రజాక్కు మోదీ ఘనస్వాగతం
- April 01, 2017
భారత పర్యటనకు వచ్చిన మలేసియా ప్రధానమంత్రి మహ్మద్ నజీబ్ టున్ అబ్దుల్ రజాక్కు ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్కు సతీసమేతంగా విచ్చేసిన రజాక్ను ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రజాక్ గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత హైదరబాద్ భవన్లో భేటీ అయిన ఇరు దేశాల ప్రధానులు పలు అంశాలపై చర్చలు జరిపారు. అక్కడి నుంచి రజాక్.. రాజ్ఘాట్కు చేరుకున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద పూలమాల ఉంచి నివాళులర్పించారు.
ఐదు రోజుల భారత్ పర్యటనలో భాగంగా మలేసియా ప్రధాని రజాక్ సతీసమేతంగా గురువారం తమిళనాడులోని చెన్నై వచ్చారు.
అదే రోజు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్రావు, ముఖ్యమంత్రి పళనిస్వామితో సమావేశమయ్యారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య, మలేసియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









