మలేసియా ప్రధానికి మహ్మద్ నజీబ్ టున్ అబ్దుల్ రజాక్కు మోదీ ఘనస్వాగతం
- April 01, 2017
భారత పర్యటనకు వచ్చిన మలేసియా ప్రధానమంత్రి మహ్మద్ నజీబ్ టున్ అబ్దుల్ రజాక్కు ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్కు సతీసమేతంగా విచ్చేసిన రజాక్ను ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రజాక్ గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత హైదరబాద్ భవన్లో భేటీ అయిన ఇరు దేశాల ప్రధానులు పలు అంశాలపై చర్చలు జరిపారు. అక్కడి నుంచి రజాక్.. రాజ్ఘాట్కు చేరుకున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద పూలమాల ఉంచి నివాళులర్పించారు.
ఐదు రోజుల భారత్ పర్యటనలో భాగంగా మలేసియా ప్రధాని రజాక్ సతీసమేతంగా గురువారం తమిళనాడులోని చెన్నై వచ్చారు.
అదే రోజు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్రావు, ముఖ్యమంత్రి పళనిస్వామితో సమావేశమయ్యారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య, మలేసియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







