రజనీకాంత్ అల్లుడు సినిమా సెట్లో
- April 01, 2017
తన అల్లుడు, హీరో ధనుష్ సినిమా సెట్కు అగ్ర కథానాయకుడు రజనీకాంత్ వెళ్లి సందడి చేశారు. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ధనుష్ హీరోగా ‘వీఐపీ-2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రజనీ సినిమా సెట్కు వచ్చిన ఫొటోలను సౌందర్య అభిమానులతో పంచుకున్నారు. ‘దీని కన్నా గొప్పదాన్ని పొందలేను. సెట్లో వన్ అండ్ ఓన్లీ సూపర్స్టార్ మా నాన్న. ధనుష్కు చివరిరోజు షూటింగ్’ అని ట్వీట్ చేశారు.
‘రఘువరన్ బీటెక్’కు సీక్వెల్గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్. థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమలాపాల్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ నటి కాజోల్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









