ఐఎస్‌ కాల్పుల్లో బంగ్లాదేశ్ ఆర్మీ ఉన్నతాధికారి మృతి

- April 01, 2017 , by Maagulf
ఐఎస్‌ కాల్పుల్లో బంగ్లాదేశ్  ఆర్మీ ఉన్నతాధికారి మృతి

ఐఎస్‌ కాల్పుల్లో బంగ్లాదేశ్‌ ఆర్మీ ఉన్నతాధికారి మృతి చెందారు. బంగ్లా ఆర్మీ వెల్లడించిన వివరాల ప్రకారం... రాపిడ్‌ యాక్షన్‌ బెటాలియన్స్‌ ఇంటెలిజెన్స్‌ బలగాలు ఉగ్రవాదుల ఏరివేత కోసం సిల్నెత్‌ ప్రాంతంలో గతవారం ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ ప్రత్యేక ఆపరేషన్‌కు సారథ్యం వహించిన ఆర్మీ ఉన్నతాధికారి అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ (41) ఉగ్రదాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు. సైనిక ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించారు. సింగపూర్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో ఆజాద్‌ మృతిచెందినట్టు శుక్రవారం బంగ్లాదేశ్‌ సైన్యం ప్రకటించింది. అజాద్‌ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com