భారత్ విమానాశ్రయాల్లో కొత్త మార్పు
- April 02, 2017
త్వరలో భారత్లోని అన్ని విమానాశ్రయాల్లోకి ఫుల్ బాడీ స్కానర్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న తడిమి తనిఖీ చేసే పద్ధతి స్థానంలోకి ఈ కొత్త స్కానర్లతో తనిఖీలు రానున్నాయి. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా గతంలోనే ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో ఆధ్వర్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వీటిని పరీక్షించి చూశారు. దేశంలోని పలు వాణిజ్య పరమైన విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ మాత్రమే సెక్యూరిటీ చూస్తుంటుంది. అయితే, అప్పట్లో ఈ స్కానర్లు బాగానే పనిచేసినప్పటికీ పలువురు ప్రయాణీకులు మాత్రం తీవ్ర అభ్యంతరం చెప్పారు.
ముఖ్యంగా భారతీయ మహిళలు ధరించే తాళి, ఎక్కువ మడతలు ఉండే చీరలాంటివాటిని స్కానింగ్ చేసే సమయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఈ నేపథ్యంలో ఈ ఐడియాకు ఎక్కువమంది అనుకూలంగా లేరని అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే, ప్రస్తుతం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో ఫుల్ బాడీ స్కానర్లు తప్పక అన్ని విమానాశ్రయాల్లో అవసరమేనని భావిస్తున్నామని వాటిని త్వరలోనే ప్రవేశపెడతామని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపారు. విమానాల్లోని ప్రయాణికుల క్యాబిన్లోకి ల్యాప్టాప్ను నిషేధించే అంశాన్ని కూడా యోచిస్తున్నట్లు వెల్లడించారు. గత నెలలో అమెరికా, బ్రిటన్ విమానాల్లోకి ల్యాప్ టాప్లను నిషేధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







