‘కసబా’ చిత్రంలో మమ్ముట్టి సరసన మళ్లీ వరలక్ష్మి
- April 06, 2017
తమిళంలో ‘పోడా పోడి’, ‘తారై తప్పట్టె’ చిత్రాల్లో నటించిన వరలక్ష్మి శరత్కుమార్ గత సంవత్సరం ‘కసబా’ చిత్రం ద్వారా మలయాళ చిత్రసీమకు పరిచయమయ్యారు. అందులో మమ్ముట్టి హీరోగా నటించారు. ఈ సంవత్సరం సముద్రగని దర్శకత్వంలోని ‘అప్పా’ తమిళ చిత్రం మలయాళంలో పునర్నిర్మించనుండగా అందులో నటించే అవకాశం వరలక్ష్మికి లభించినా పూజ జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరో మలయాళ చిత్రంలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. ఈ చిత్రంలోనూ హీరో మమ్ముట్టి కావడం గమనార్హం. మమ్ముట్టితో ‘రాజాధి రాజా’ అనే మలయాళ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అజయ్ వాసుదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
‘రాజాధి రాజా’లో మమ్ముట్టికి జంటగా రాయ్లక్ష్మీ నటించడంతో ప్రస్తుత చిత్రంలోనూ మమ్ముట్టి సరసన ఆమెనే నటిస్తుందని మొదట భావించారు. అనివార్య కారణాలతో ఆమె నటించడానికి సాధ్యపడకపోవడంతో ఆ అవకాశం వరలక్ష్మిని వరించింది.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









