ప్రభుత్వ, అసైన్డ్ భూములు కలిపి బందరు పోర్టుకు 3,014.43 ఎకరాలు
- April 06, 2017
బందరు పోర్టు నిర్మాణానికి అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయి. పోర్టు నిర్మాణానికి ముందుకు వచ్చిన డెవలపర్ సంస్థ మచిలీపట్నం పోర్టు లిమిటెడ్కు 3014.43 ఎకరాల భూమిని అప్పగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో ప్రభుత్వ భూములు 2360.52 ఎకరాలు, అసైన్డ్ భూములు 653.91 ఎకరాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ భూములను రెవెన్యూ శాఖ నుంచి పోర్టు శాఖ ఎప్పుడో తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే.. ఏళ్ల తరబడి పోర్టు నిర్మాణంలో కదలిక లేకపోవడంతో.. ఈ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ ఆక్రమణలు పెరిగితే.. పోర్టు నిర్మాణానికి అడ్డకులు ఎదురవుతాయని ఈ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఆందోళన వ్యక్తం చేసిందని పోర్టు శాఖ పేర్కొంది.
ఈ భూములను పరిరక్షించాలంటే పోర్టు లిమిటెడ్కు తక్షణమే భూములు అప్పగించడం మంచిదని పోర్టు శాఖ సూచించింది. ఈ సూచన మేరకు.. ప్రభుత్వం మచిలీపట్నం పోర్టుకు అప్పగించడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. ఈ భూములను పోలీసు, పోర్టు, రెవెన్యూ యంత్రాంగం సాయంతో.. డెవలప్ సంస్థకు అప్పగించాలని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నం ఆర్డిఒ, పోలీసు ఇన్స్పెక్టర్, ఎంఎడిఎ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పోర్టు కన్జర్వేటర్ సమక్షంలో డెవలపర్ సంస్థకు భూములు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







