హత్యకేసులో 20 ఏళ్ళ జైలు శిక్ష
- April 08, 2017
సెక్యూరిటీ ఉద్యోగి హత్య కేసులో కొరియాకి చెందిన వ్యక్తికి 20 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఇదే కేసులో మరో ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష, డిపోర్టేషన్ని న్యాయస్థానం విధించడం జరిగింది. అలాగే, నలుగురు వ్యక్తులూ కలిసి బ్లడ్ మనీ 200,000 ఖతారీ రియాల్స్ని బాధిత కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది న్యాయస్థానం. ఓ కంపెనీలోకి అక్రమంగా ప్రవేశించి, అందులోని ఐరన్ సేఫ్ని దొంగిలించే క్రమంలో సెక్యూరిటీ ఉద్యోగిని నిందితులు హతమార్చారు. మరో కేసులో దోహా క్రిమినల్ కోర్టు, ఇండోనేసియాకి చెందిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, డిపోర్టేషన్ని విధించింది. షాపింగ్ మాల్లో దొంగతనం చేసిన నేరంపై నిందితుడు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. దొంగిలించిన వస్తువులతో షాపింగ్ మాల్ నుంచి పారిపోయిన ఆ వ్యక్తి, మూడు రోజుల తర్వాత తిరిగి అదే షాపింగ్ మాల్కి వెళ్ళగా సెక్యూరిటీ కెమెరా ద్వారా అతన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







