క్షమాబిక్ష: ఎయిర్ ఇండియా 50 శాతం డిస్కౌంట్
- April 08, 2017
రియాద్: క్షమాభిక్ష కోసం నమోదు చేసుకున్నవారికి 50 శాతం డిస్కౌంట్తో కూడిన ప్రయాణ ధరల్ని ప్రకటించింది ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా సీనియర్ ఎజిఎం కుందన్ లాల్ కొత్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. క్షమాభిక్ష సమయంలో ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని ఆయన వివరించారు. రియాద్, జెడ్డా, దమ్మమ్ నుంచి ఇండియాలోని పలు ప్రాంతాలకు సుమారుగా 500 సౌదీ రియాల్స్ (వీటికి ట్యాక్స్లు అదనం), రియాద్, జెడ్డా, దమ్మమ్ నుంచి ఢిల్లీకి 659 సౌది రియాల్స్, ఇతర డెస్టినేషన్స్కి 595 సౌదీ రియాల్స్ ధర నిర్ణయించారు. ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి 40 కిలోల చెక్డ్ ఇన్ బ్యాగేజీని రియాద్, మరియు జెడ్డాల నుంచి, అలాగే దమ్మమ్ నుంచి 30 కిలోల బ్యాగేజీని ప్రయాణీకులకు అనుమతిస్తారు. ఇండియన్ ఎంబసీ లేదా కాన్సులేట్ నుంచి ఇచ్చే ఎమర్జన్సీ సర్టిఫికెట్ని లేదా పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ జారీ చేసే ఫైనల్ ఎగ్జిట్ వీసా చూపించి ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. హిందూస్తానీ బజ్మీ ఉర్దు ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎయిర్ ఇండియాకి అలాగే, కుందన్లాల్కి కృతజ్ఞతలు తెలిపారు. పేదలు, మరియు బ్లూ క్లార్ ఉద్యోగుల కోసం ఈ తగ్గింపు ధరల విమానయానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారాయన.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







