హైదరాబాద్లో దుబాయ్ తుంబె గ్రూప్ ఆసుపత్రి
- April 11, 2017
దుబాయ్ కేంద్రంగా వైద్య సేవలందిస్తున్న తుంబె గ్రూప్ భారత్లో తొలి ఆసుపత్రిని బుధవారం ప్రారంభిస్తోంది. హైదరాబాద్ చాదర్ఘాట్లో ఉన్న న్యూలైఫ్ హాస్పిటల్ను తుంబె గ్రూప్ కొనుగోలు చేసి ఆధునీకరించింది. తుంబె హాస్పిటల్ న్యూ లైఫ్ పేరుతో ఈ 200 పడకల ఆసుపత్రిని నిర్వహిస్తామని సంస్థ మెడికల్ డైరెక్టర్ టి.శ్యామ్ సుందర్ చెప్పారు. హాస్పిటల్ సీవోవో బాలాజీ గోలి, గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ రవి తిప్పరాజుతో కలసి మంగళవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు.
చాదర్ఘాట్ హాస్పిటల్ కంటే పెద్ద ఆసుపత్రిని మాదాపూర్ సమీపంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. మూడేళ్లలో 1,500 పడకల సామర్థ్యానికి చేరుకోవాలన్నది గ్రూప్ లక్ష్యమని వెల్లడించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 8–10 ఆసుపత్రులు వచ్చే అవకాశం ఉందన్నారు. నర్సులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పనున్నట్టు శ్యామ్సుందర్ తెలిపారు. తుంబె గ్రూప్ను కర్ణాటకలోని మంగళూరుకు చెందిన తుంబె మొయిద్దీన్ ఏర్పాటు చేశారు. యూఏఈలో సంస్థకు నాలుగు ఆసుపత్రులున్నాయి. రియల్ ఎస్టేట్, రిటైల్, హాస్పిటాలిటీ రంగాల్లోనూ ఉంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









