భారీగా పేలుడు పదార్థాలు లభ్యం, పలువురి అరెస్ట్
- October 01, 2015
బహ్రెయిన్ భద్రతాధికారులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను, ఆయుధాలను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లో కొందరు అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ వ్యక్తులకు ఇరాన్, ఇరాక్లతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ఈ వివరాల్ని పొందుపర్చారు. మనామా దగ్గరలోని నువైద్రత్లో గల ఓ ఇంట్లో ఈ పేలుడు పదార్థాల్ని, ఆయుధాల్ని కనుగొన్నారు. పట్టుకున్నవాటిల్లో సి4 పేలుడు పదార్థాలతోపాటు, ఇతర పేలుడు పదార్థాలు ఒకటిన్నర టన్నుల మేర ఉన్నట్లుగా సమాచారమ్. రైఫిల్లు, పిస్టోల్లు, హేండ్ గ్రెనేడ్లు కూడా ఉన్నాయి. ఇరాన్, ఇరాక్లతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు పట్టుబడ్డ వ్యక్తులపై ఉండడంతో, రహస్యంగా విచారిస్తున్నారు. ఆగస్ట్లో బహ్రెయిన్ పోలీసులు ఐదుగురు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. ఓ బాంబు పేలుడులో ఇద్దరు పోలీసులు మృతి చెందిన కేసులో వారిని అరెస్ట్ చేయడం జరిగింది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







