చిన్నారి అదితి కథ విషాదాంతం
- October 01, 2015
చిన్నారి అదితి కథ విషాదమయ్యింది. వారం కిందట విశాఖపట్టణం డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన ఆమె మృతదేహం విజయనగరం జిల్లా భోగాపురం సన్రే బీచ్లో లభించింది. ఏడురోజుల క్రితం ఇదే రోజున ఈ దుర్ఘటన జరిగింది. ఈ రోజు సాయంత్రం భోగాపురం బీచ్లో అదితి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సందేహాల నడుమ ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసుల సమాచారంతో ఘటనాస్థలికి అదితి కుటుంబీకులు, బంధువులు చేరుకున్నారు. మృతదేహంపై ఉన్న చెవిదిద్దులు, మెడలోని తాయత్తు తదితర ఆనవాళ్లతో అదితి భౌతిక కాయాన్ని ఆమె తండ్రి గుర్తించారు. అదితిని విగతజీవిగా చూసిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఏడుస్తూ బంధువులు కుప్పకూలిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి అదితిని వెదికేందుకు ఖర్చుకు వెనుకాడకుండా ప్రయత్నాలు చేసింది.
యమ్.వాసు దేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి - బహ్రెయిన్).
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







