చిన్నారి అదితి కథ విషాదాంతం
- October 01, 2015
చిన్నారి అదితి కథ విషాదమయ్యింది. వారం కిందట విశాఖపట్టణం డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన ఆమె మృతదేహం విజయనగరం జిల్లా భోగాపురం సన్రే బీచ్లో లభించింది. ఏడురోజుల క్రితం ఇదే రోజున ఈ దుర్ఘటన జరిగింది. ఈ రోజు సాయంత్రం భోగాపురం బీచ్లో అదితి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సందేహాల నడుమ ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసుల సమాచారంతో ఘటనాస్థలికి అదితి కుటుంబీకులు, బంధువులు చేరుకున్నారు. మృతదేహంపై ఉన్న చెవిదిద్దులు, మెడలోని తాయత్తు తదితర ఆనవాళ్లతో అదితి భౌతిక కాయాన్ని ఆమె తండ్రి గుర్తించారు. అదితిని విగతజీవిగా చూసిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఏడుస్తూ బంధువులు కుప్పకూలిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి అదితిని వెదికేందుకు ఖర్చుకు వెనుకాడకుండా ప్రయత్నాలు చేసింది.
యమ్.వాసు దేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి - బహ్రెయిన్).
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







