27 ఏళ్ళుగా భారతీయ వలసదారుడి కోసం 'వేట'
- April 13, 2017
మనామా: 27 ఏళ్ళ క్రితం ఇండియా నుంచి బహ్రెయిన్కి వచ్చిన ఓ వ్యక్తి ఆచూకీ అప్పటినుంచీ తెలియరావడంలేదు. 1987లో సాజిద్ పాషా అలియాస్ మొహమ్మద్ ఇస్మాయిల్ షరీఫ్ బహ్రెయిన్కి వచ్చారు. మూడేళ్ళ తర్వాత ఆయన ఇండియాకి తిరిగి వెళ్ళారు. ఇండియాలోనే ఉండిపోవాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరినా, ఇరాక్ యుద్ధం కారణంగా తనకు రావాల్సిన సొమ్ము బహ్రెయిన్లోనే ఉండిపోయిందని చెబుతూ తిరిగి ఇరాక్కి వెళ్ళిన సాజిద్ పాషా 1990 నుంచి ఆచూకీ లేకుండా పోయారు. ఇన్నేళ్ళలో మూడు సార్లు మాత్రమే తమతో ఆయన మాట్లాడారనీ, 1990 తర్వాత అతన్నుంచి ఎలాంటి కాంటాక్ట్ లేదని సాజిద్ పాషా సోదరుడు ఇంతియాజ్ షరీఫ్ చెప్పారు. కుమారుడి మీద బెంగతో తన తల్లి అనారోగ్యం పాలైందనీ, ఆమె ఆసుపత్రిలో క్రిటికల్ స్టేజ్లో ఉన్నారని ఆయన వాపోయారు. సాజిద్ పాషాకి సంబంధించి ఒకే ఒక్క ఫొటోగ్రాఫ్ అది కూడా పాతది మాత్రమే వారి దగ్గర ఉంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







