క్షమాభిక్ష కోసం 10 మంది భారతీయ వలసదారుల ఎదురుచూపులు
- April 13, 2017
అబుధాబి: భారతీయ వలసకార్మికులైన 10 మంది అల్ అయిన్ జైలులో మగ్గుతున్నారు. పాకిస్తానీ కార్మికుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న వీరంతా, న్యాయస్థానం నుంచి క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 19వ తేఈకి ఈ కేసు విచారణ వాయిదా పడిందని అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు చెప్పారు. మృతుడి తండ్రి, కోర్టులో హాజరై, క్షమాబిక్షకి అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చారు. ఇంకో వైపున ఇండియన్ ఛారిటీ ఆర్గనైజేషన్ నిందితుల తరఫున 200,000 బ్లడ్ మనీని కూడా బాధిత కుటుంబానికి అందజేసింది. సర్బత్ దా భాలా ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఎస్పిఎస్ ఒబెరాయ్ ఈ మొత్తాన్ని డొనేట్ చేశారు. ఈ కేసులో మొత్తం 10 మందికి మరణ శిక్ష విధించగా, ఒకరికి మాత్రం మరణ శిక్ష తప్పింది. మరణశిక్షను ఎదుర్కొనాల్సిన స్థితిలో దయనీయంగా జైల్లో మగ్గుతున్నవారంతా క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







