క్షమాభిక్ష కోసం 10 మంది భారతీయ వలసదారుల ఎదురుచూపులు

- April 13, 2017 , by Maagulf
క్షమాభిక్ష కోసం 10 మంది భారతీయ వలసదారుల ఎదురుచూపులు

అబుధాబి: భారతీయ వలసకార్మికులైన 10 మంది అల్‌ అయిన్‌ జైలులో మగ్గుతున్నారు. పాకిస్తానీ కార్మికుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న వీరంతా, న్యాయస్థానం నుంచి క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ 19వ తేఈకి ఈ కేసు విచారణ వాయిదా పడిందని అబుదాబీలోని ఇండియన్‌ ఎంబసీ అధికారి ఒకరు చెప్పారు. మృతుడి తండ్రి, కోర్టులో హాజరై, క్షమాబిక్షకి అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చారు. ఇంకో వైపున ఇండియన్‌ ఛారిటీ ఆర్గనైజేషన్‌ నిందితుల తరఫున 200,000 బ్లడ్‌ మనీని కూడా బాధిత కుటుంబానికి అందజేసింది. సర్బత్‌ దా భాలా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ ఎస్‌పిఎస్‌ ఒబెరాయ్‌ ఈ మొత్తాన్ని డొనేట్‌ చేశారు. ఈ కేసులో మొత్తం 10 మందికి మరణ శిక్ష విధించగా, ఒకరికి మాత్రం మరణ శిక్ష తప్పింది. మరణశిక్షను ఎదుర్కొనాల్సిన స్థితిలో దయనీయంగా జైల్లో మగ్గుతున్నవారంతా క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com