క్షమాభిక్ష కోసం 10 మంది భారతీయ వలసదారుల ఎదురుచూపులు
- April 13, 2017
అబుధాబి: భారతీయ వలసకార్మికులైన 10 మంది అల్ అయిన్ జైలులో మగ్గుతున్నారు. పాకిస్తానీ కార్మికుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న వీరంతా, న్యాయస్థానం నుంచి క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 19వ తేఈకి ఈ కేసు విచారణ వాయిదా పడిందని అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు చెప్పారు. మృతుడి తండ్రి, కోర్టులో హాజరై, క్షమాబిక్షకి అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చారు. ఇంకో వైపున ఇండియన్ ఛారిటీ ఆర్గనైజేషన్ నిందితుల తరఫున 200,000 బ్లడ్ మనీని కూడా బాధిత కుటుంబానికి అందజేసింది. సర్బత్ దా భాలా ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఎస్పిఎస్ ఒబెరాయ్ ఈ మొత్తాన్ని డొనేట్ చేశారు. ఈ కేసులో మొత్తం 10 మందికి మరణ శిక్ష విధించగా, ఒకరికి మాత్రం మరణ శిక్ష తప్పింది. మరణశిక్షను ఎదుర్కొనాల్సిన స్థితిలో దయనీయంగా జైల్లో మగ్గుతున్నవారంతా క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







