కార్నిచ్ లో ప్రారంభమైన జి.సి.సి తీరరక్షణ వారోత్సవం
- April 13, 2017
దోహా:బుధవారం దోహాలోని అల్ బందర్, దోహా కనిచే లో అట్టహాసంగా ప్రారంభమైన జి సి సి తీరరక్షణ వారోత్సవ వేడుకలు పలువుర్నిఅలరిస్తున్నాయి. కోస్ట్ జనరల్ డైరెక్టరేట్ మరియు బోర్డర్ సెక్యూరిటీ నిర్వహణలో "మా లక్ష్యం భద్రత మరియు రక్షణ "అనే అంశంపై ఈ వేడుకలను కొనసాగిస్తున్నారు. జీసీసీ దేశాల తీరదళాల మధ్య పరస్పర సహకారం విస్తరించేందుకు సముద్రంలోకి సురక్షితంగా వెళ్లేవారు కోసం సముద్ర భద్రత అవగాహన పెంచడానికి వేడుకలను అలాగే క్రమంలో జరుపుకుంటారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో డైరెక్టర్ జనరల్, కోస్ట్ జనరల్ డైరెక్టరేట్ బోర్డర్ సెక్యూరిటీ, స్టాఫ్ బ్రిగేడియర్ (నావికాదళం) ఆలీ అహ్మద్ ఆల్-బిడాది మాట్లాడుతూ, జి సి సి తీరరక్షణ వారోత్సవ వేడుకలు పౌరులు మరియు నివాసితులు సముద్ర భద్రతా విధానాలు గురించి అవగాహన పెంచటానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పారు.తమ కార్యకలాపాలు ప్రజలకు పరిచయం చేయడం సముద్ర భద్రతా బలోపేతం చేసి సముద్ర వినియోగదారుల జీవితాలను రక్షించడానికి భద్రతా ఏజెన్సీలు చేపట్టిన చర్యలను గూర్చి తెలుసు కొనేందుకు సహాయపడతాయని అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







