కార్నిచ్ లో ప్రారంభమైన జి.సి.సి తీరరక్షణ వారోత్సవం
- April 13, 2017
దోహా:బుధవారం దోహాలోని అల్ బందర్, దోహా కనిచే లో అట్టహాసంగా ప్రారంభమైన జి సి సి తీరరక్షణ వారోత్సవ వేడుకలు పలువుర్నిఅలరిస్తున్నాయి. కోస్ట్ జనరల్ డైరెక్టరేట్ మరియు బోర్డర్ సెక్యూరిటీ నిర్వహణలో "మా లక్ష్యం భద్రత మరియు రక్షణ "అనే అంశంపై ఈ వేడుకలను కొనసాగిస్తున్నారు. జీసీసీ దేశాల తీరదళాల మధ్య పరస్పర సహకారం విస్తరించేందుకు సముద్రంలోకి సురక్షితంగా వెళ్లేవారు కోసం సముద్ర భద్రత అవగాహన పెంచడానికి వేడుకలను అలాగే క్రమంలో జరుపుకుంటారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో డైరెక్టర్ జనరల్, కోస్ట్ జనరల్ డైరెక్టరేట్ బోర్డర్ సెక్యూరిటీ, స్టాఫ్ బ్రిగేడియర్ (నావికాదళం) ఆలీ అహ్మద్ ఆల్-బిడాది మాట్లాడుతూ, జి సి సి తీరరక్షణ వారోత్సవ వేడుకలు పౌరులు మరియు నివాసితులు సముద్ర భద్రతా విధానాలు గురించి అవగాహన పెంచటానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పారు.తమ కార్యకలాపాలు ప్రజలకు పరిచయం చేయడం సముద్ర భద్రతా బలోపేతం చేసి సముద్ర వినియోగదారుల జీవితాలను రక్షించడానికి భద్రతా ఏజెన్సీలు చేపట్టిన చర్యలను గూర్చి తెలుసు కొనేందుకు సహాయపడతాయని అన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







